నాగవరం వడ్డిపల్లి అభివృద్ధి కమిటి.
నమస్కారం, నా పేరు కుంచం ఈశ్వర్ ,మా ఊరు నాగవరం వడ్డిపల్లి, చిట్వేల్ మండలం, కడప జిల్లా.మనం పుట్టి పెరిగిన ఊరు కన్నతల్లి తో సమానం.సొంత ఊరికి ఏంతో కొంత సహాయం చేసి ఋణం తీర్చుకోవాలని నా ముఖ్య ఉద్దేశ్యం. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా ఊరి తలరాత మారలేదు, అభివృద్ధికి నోచుకోలేదు.2017 ఏప్రిల్ నెల వరకు కూడా ఇంచుమించు 150 గృహాలు,800 మంది ప్రజలు ఉన్న మా ఊరిలో త్రాగునీటి కోసం మంచి నీటి కుళాయి ఒకే ఒక్కటి మాత్రమే ఉండేది.చాలా సంవత్సరాలు గా వీధి లైట్లు లేని ఊరు,ఇవ్వే కాదు ఇంకా సమస్యలు ఉండేవి.
ఈ సమస్యలు అన్ని పరిష్కరించాలనే దృఢ సంకల్పంతో 2017 ఫిబ్రవరి 24 వ తేది మహాశివరాత్రి నాడు నా స్నేహితుడు మొక్కట్ల శ్రీనివాసులు తో కలిసి నాగవరం వడ్డిపల్లి అభివృద్ధి కమిటిని స్థాపించాము. అభివృద్ధి కమిటి పేరు మీద whatsapp గ్రూప్ ఏర్పాటు చేసి దేశ విదేశాలలో (కువైట్, దుబాయ్, కత్తర్) నివసిస్తున్న మా ఊరి ప్రజలందరి ఫోన్ నెంబర్లు సేకరించి వారికి ఊరి అభిరుద్ది కార్యక్రమాల గురించి వివరించాము. ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించి తమ సహాయ సహకారాలు అందించి ఊరి అభివృద్ధికి కృషి చేయడానికి ముందుకు వచ్చారు.
ఇప్పటి వరకు ఊరిలో చాలా అభివృద్ధి పనులు చేపట్టి విజయవంతం చేసాము. కొందరి పెద్దల సహాయం మరియు ఊరి ప్రజలందరి సహకారంతో త్రాగునీటి సమస్య నిర్ములించుకున్నాము. విదేశాల్లో(కువైట్, దుబాయ్, కత్తర్) నివసిస్తున్న ఊరి ప్రజల సహకారంతో LED street lights ఏర్పాటు చేసుకున్నాము. చాలా సంవత్సరాలుగా అభిరుద్ది కి నోచుకోని మా ఊరి దేవాలయాలను అభివృద్ధి చేసుకున్నాము. చాలా చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకున్నాము. ఊరిలో జరిగే ప్రతి కార్యక్రమం మరిము దేవుని ఊరేగింపు, ఉత్సవాలు ఇలా అన్ని కూడా అభివృద్ధి కమిటి ద్వారా నిర్వహిస్తున్నాము. మేము చేసిన ప్రయత్నం మా ఊరి తలరాతనే మార్చేసింది. మా ఊరి పెద్దలు, యువకులు మరియు ప్రజలందరి కృషి ఉండడంతో మా ఊరు ఉన్నంత అభివృద్ధి చెందింది. మా ఊరి ప్రజలందరు కలిసి మెలిసి ఒకే కుటుంబంలా సుఖ సంతోషాలతో గడుపుతున్నారు. ఊరి అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఊరి ప్రజలందరికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ముగింపు:దేశంలోని పల్లెల్లో నివసిస్తున్న ప్రజలందరికి నా విజ్ఞప్తి, ఎన్ని ప్రభుత్వాలు మారినా మన పల్లె తలరాత మారలేదు అభివృద్ధి జరగలేదు అని బాదపడకుండా, పల్లెల్లో నివసిస్తున్న ప్రజలందరు కలిసి మెలిసి పల్లె అభివృద్ధి కోసం ప్రయత్నాలు జరపాలని మా మనవి. అందరూ కలిసి మెలిసి ప్రయత్నిస్తే సాధించలేనిది ఏమి లేదు. పల్లెలు అభివృద్ధి జరిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది.
భారత్ మాతకి జై, వందేమాతరం, జై హింద్.
కుంచం ఈశ్వర్,
వ్యవస్థాపకులు, నాగవరం వడ్డిపల్లి అభిరుద్ది కమిటి.
No comments:
Post a Comment