నాగవరం వడ్డిపల్లి అభివృద్ధి కమిటి.
ధర్మో రక్షితి రక్షతః
అందరికి నమస్కారము.
ప్రతి ఒక్కరికి తమ జన్మస్థలం అయిన ఊరంటే ఏంతో అభిమానం,ప్రేమ,మమకారం,ఏన్నో తీపి ఙ్ఞాపకాలు ఉంటాయి.అలాగే మా ఊరంటే నాకు కూడా ఏంతో అభిమానం,గౌరవం,ప్రేమ ఉంది.మన కన్నతల్లిలాంటి ఊరికి ఏదోక మంచి పని చేసి ఋణం తీర్చుకోవాలి.అది ప్రతి ఒక్కరికి, ఆ గొప్ప సంకల్పం ఉండాలి.[ శారద ఙ్ఞాన పుత్ర, బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు ] గారి ప్రవచనాలు వినడం చేత, తెలుసుకున్న వాటిని కొన్ని ఆచరణలోకి తీసుకోచ్చి, సమాజనికి ఏధైన ఉపకారం చేయడం కొరకై మా వంతు సహయం, కృషి చేయాలని నిర్ణయించుకుని, మొదటి సారిగా మా ఊరిలోనే కొన్ని మంచి పనులు చెపట్టాము.అవి అందరి కృషితో,సహయంతో,గొప్ప గొప్ప పనులు మరియు దేవాలయల అభివృద్ధి ఇలా ఎన్నో మంచి పనులు ఊరు వారందరం కలసి చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది.అందరితో పాటు నేను అందులో భాగస్వామిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది.
శ్రీరామ చంద్రుడే ఆనాడు వనవాసంలో లక్ష్మణా స్వామితో జన్మభూమి గురించి కొన్ని మంచి మాటలు అన్నాడని రామయణంలో ఉంది..
{జననీ జన్మ భూమిశ్చ/ స్వర్గాదపి గరీయసి అనగా ... }
ఓ లక్ష్మణా! బంగారు మయమైన లంక నాకు ఇష్టము లేదు.ఎందుకనగా జననీ, జన్మభూమి స్వర్గ ముకన్నాగొప్పవి. అంతేకాదు యస్య నిశ్వసితం వేదాః వేదేభ్యోఖిలం జగత్ భగవంతుని ఉచ్చ్వాశ నిశ్వాసాలనుండి వేదాలు పుట్టాయి, వేదాల నుండి సమస్త విశ్వం పుట్టింది. అనగా వేదాలు విశ్వసృష్టిని చక్కగా వివరించాయి. ఇట్టి వేదభూమిలో పుట్టిన మనం ఎలా ఉండాలో,ఎలాఉండ కూడదో, మన ఆచార వ్యవహారాలూ అన్ని చక్కగా పురాణ గ్రంధాలు వివరించాయి. అంత గొప్పది మన దేశం.అని వివరంగా శ్రీరాముడు లక్ష్మణా స్వామితో చెప్పాడని రామయణం తెలియజేస్తుంది.
ప్రతి ఊరి వారందరు కలసి తమ ఊరిని, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని,మన దేశ స్వర్ణ స్వరాజ్యంలో ,బంగారు పల్లెగా రూపుదిద్దుకోవాలని కొరుకుంటున్నాను.
పుల్లగంటి విశ్వనాథ్,
నిర్వాహకులు, నాగవరం వడ్డిపల్లి అభివృద్ధి కమిటి.
No comments:
Post a Comment